Wednesday 1 January 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:       చూపులు కలసి, వెన్నెల కురిసే వేళలో
                 మాటలు రాక, పెదవులు వణికేనేలనో
                 మాటలు రాక, పెదవులు వణికే వేళలో
                 మధువులేవో, మనసుల నూరే నేలనో
చరణం:      ఊహలన్ని నిజమై, మదినూయలనూపే వేళ
                 కలలన్ని వరాలై, కొంగుముడివడే శుభవేళ
                 ఏడడుగులు వేస్తూ, ఎద సవ్వడులను విందాము
                 ఇద్దరమొకటంటూ, కడదాకా కలిసుందాము
చరణం:       నీ చూపుల లేఖను, చదివే ఈ తొలిరాతిరిన
                  నీ రూపు వెలిగెనే, నా ఎదను కోటి దివ్వెలుగ
                  చిరునవ్వుల సడికిక, చిరునామా మనమనేల
                  ఏ కవి రాయలేని, కావ్యంలా సాగిపోదాం
చరణం:       మన మనస్సులొక్కటై, చేసే వలపుల మధనాల
                  పొంగేటి అమృతమే, కాదా అనురాగమంటే
                  ఆ అనురాగాలే, మనవైన సరాగాలుగా
                  పాడుతూ ఈ ఇలను, మధువనిలా మలచుకుందాము
                                 **********

No comments:

Post a Comment