పల్లవి: ఆనందం కావాలా
అందరికీ సొంతం
అయితే మరి వినవోయీ
చెబుతా ఆ తంత్రం
చరణం: కన్నుల జారే చుక్కల వడిలో
కరిగిన ఆశలు నివురైపోతే
మనిషికి మనిషే తోడుగ రాగా
సమతలు మమతలు మనవై పోగా
వికాస వేణియ హాసపు రాగం
విరామమెరుగక వింటూ ఉందాం
చరణం: వేదనకిక్కడ చోటే లేదని
వేడుకకెపుడూ లోటే రాదని
మనసుకు మనసులు జతగా చేద్దాం
అడుగులు ఒంటరి కానే కావని
దూరం చెరగక పోనే పోదని
నవ్వుతు చెలిమికి ప్రాణం పోద్దాం
చరణం: మనసుల అందం తెలిపే తీరుగ
అందరు ఒకటై సాగే తోవన
దేవుడు కూడా జతగాడవడా
మంచిని మతమై పెంపే చేస్తే
విలువల భవితకు పునాదులేస్తే
మనిషివి నీవని నమ్మే నీ'వని'. ******