Monday 21 July 2014

శిద్దాని భావగీతాలు

పల్లవి:  ఆనందం కావాలా
           అందరికీ సొంతం
           అయితే మరి వినవోయీ
           చెబుతా ఆ తంత్రం
         
చరణం:  కన్నుల జారే చుక్కల వడిలో
            కరిగిన ఆశలు నివురైపోతే
            మనిషికి మనిషే తోడుగ రాగా
            సమతలు మమతలు మనవై పోగా
           వికాస వేణియ హాసపు రాగం 
           విరామమెరుగక వింటూ ఉందాం
చరణం:  వేదనకిక్కడ చోటే లేదని
            వేడుకకెపుడూ లోటే రాదని
            మనసుకు మనసులు జతగా చేద్దాం
            అడుగులు ఒంటరి కానే కావని
            దూరం చెరగక పోనే పోదని
            నవ్వుతు చెలిమికి ప్రాణం పోద్దాం
చరణం:   మనసుల అందం తెలిపే తీరుగ
             అందరు ఒకటై సాగే తోవన
             దేవుడు కూడా జతగాడవడా
             మంచిని మతమై పెంపే చేస్తే
             విలువల భవితకు పునాదులేస్తే
             మనిషివి నీవని నమ్మే నీ'వని'.
                            ******

No comments:

Post a Comment