పల్లవి: చూపులు కలసి, వెన్నెల కురిసే వేళలో
మాటలు రాక, పెదవులు వణికేనేలనో
మాటలు రాక, పెదవులు వణికే వేళలో
మధువులేవో, మనసుల నూరే నేలనో
చరణం: ఊహలన్ని నిజమై, మదినూయలనూపే వేళ
కలలన్ని
వరాలై, కొంగుముడివడే శుభవేళ
ఏడడుగులు
వేస్తూ, ఎద సవ్వడులను విందాము
ఇద్దరమొకటంటూ, కడదాకా కలిసుందాము
చరణం: నీ చూపుల లేఖను, చదివే ఈ తొలిరాతిరిన
నీ రూపు
వెలిగెనే, నా ఎదను కోటి దివ్వెలుగ
చిరునవ్వుల
సడికిక, చిరునామా మనమనేల
ఏ కవి
రాయలేని, కావ్యంలా సాగిపోదాం
చరణం:
మన
మనస్సులొక్కటై, చేసే వలపుల మధనాల
పొంగేటి
అమృతమే, కాదా అనురాగమంటే
ఆ అనురాగాలే, మనవైన సరాగాలుగా
పాడుతూ ఈ
ఇలను, మధువనిలా మలచుకుందాము
**********